యౌండే: ఆఫ్రికా దేశమైన కామెరూన్లోని ఫుట్బాల్ (Foot ball) స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందారు. డజన్ల కొద్ది గాయపడ్డారు. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ట్రోఫీలో భాగంగా యౌండేలోని ఒలెంబే స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నది. అయితే తమ అభిమాన ఆటగాళ్లకు చూసేందుకు ప్రేక్షకులు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకురావడంతో స్టేడియం మొదటి గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో అర డజను మంది మృతిచెందారు.
ఈ ఘటనపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్బాల్ (CAF) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులను గురించి వివరాలు తెలుసుకుంటున్నామని ప్రకటించింది. కామెరూన్, కామరోస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది.