మియామీ : అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం జరిగింది. మియామీలో ఓ పన్నెండు అంతస్తుల భవనం పాక్షికంగా కుప్పకూలింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం వేకువజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా 159 మంది జాడ తెలియకుండాపోయింది. వాళ్లు శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. చాైంప్లెన్ టవర్స్గా పిలిచే ఈ భవనం సముద్రతీరంలో ఉన్నది. దీంతో విదేశీయులు, పర్యాటకులు ఈ బిల్డింగ్లో ఎక్కువగా బస చేస్తారు.