రియో డీ జెనీరో: బ్రెజిల్లోని రియో డీ జెనీరోపై (Rio de Janeiro) వరణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండురోలుగా కుంభవృష్టి కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడంతో 14 మంది మంది మృతిచెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
సముద్ర తీర పట్టణమైన కలోనియల్, పర్యాటక ప్రాంతమైన పారాటీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల ధాటికి ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తల్లి సహా ఎనిమిది చిన్నారులు సజీవ సమాధి అయ్యారని చెప్పారు. మరో ఐదురుగు వరదల్లో కొట్టుకుపోయారని వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. వానలు ఇంకా తగ్గకపోవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా, మరో రెండు రోజులపాటు రియో డీ జెనీరో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరువారాల క్రితం ఇదే రాష్ట్రంలో కురిన వానల ధాటికి మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో 233 మంది చనిపోయారు.
తాజా వరదలపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో స్పందించారు. ఫెడరల్ ప్రభుత్వం సహాయక చర్యలకోసం తక్షణమే మిలిటరీ హెలీకాప్టర్లను పంపిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ సెక్రెటరీ అలెగ్జాండర్ బాధిత ప్రాంతాలకు చేరుకున్నారని వెల్లడించారు.