బీజింగ్, నవంబర్ 30: ఆధునిక చైనా పితామహుడు, మాజీ దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) కన్నుమూశారు. వృద్ధాప్యం, కీలక అవయవాలు పనిచేయకపోవడంతో బుధవారం మరణించారు. నేడు చైనా ఆర్థికంగా చాలా బలంగా ఉందంటే దాని వెనుక జియాంగ్ కృషి ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చైనా చేరడంలో కీలక పాత్ర పోషించారు. తియాన్న్మెన్ స్వేర్ ఘటన తర్వాత అంతర్జాతీయంగా పరపతి కోల్పోయిన చైనాను తిరిగి గాడిన పెట్టారు. కమ్యూనిస్టు పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి మరింత పటిష్టం చేశారు. భారత్లో పర్యటించిన తొలి చైనా అధ్యక్షుడు జియాంగే కావడం గమనార్హం.