హైదరాబాద్ : ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే సహించబోమని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav ) హెచ్చరించారు.ఓటరు మ్యాపింగ్ విధానం, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR) తీరును తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కులో ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు.
ఎస్ఐఆర్లో ( SIR ) కార్యక్రమంలో సాంకేతికతపై అనుభవం ఉన్న వారిని నియమించాలని డిమాండ్ చేశారు. సర్ పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయని,వాటిని నివృత్తి చేయాలని కోరారు. పార్టీ పరంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , ఓటర్లకు అందుబాటులో ఉండాలని కోరారు.