హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. దీంతో ఆయన అవయవాలను తరలించేందుకు మలక్పేట యశోద దవాఖాన నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ వరకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానెల్ (Green channel) ఏర్పాటు చేశారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ (32) కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసభ్యులు ఆయనను మలక్పేట యశోదకు తరలించారు. కాగా, వైద్యులు ఆయనను బ్రెయిన్డెడ్గా ప్రకటించారు. దీంతో అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకువచ్చారు.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చిక్సిత్స పొందుతున్న ఓ వ్యక్తికి విజయ్ కుమార్ గుండెను అమర్చనున్నారు. దీనికోసం మల్పేట యశోద నుంచి అపోలో వరకు పోలీసులు గ్రీన్చానల్ ఏర్పాటు చేశారు.