అఫ్జల్గంజ్ వద్ద బుధవారం ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న ఈదీబజార్కు చెందిన అబ్దుల్ రహమాన్ అనే యువకుడిని ఆపి.. పరిశీలించగా, అతడి ద్విచక్రవాహనం(టీఎస్11ఈఎల్5838)పై ఏకంగా 88 చలాన్లు, రూ. 28,110 వేలు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బండిని సీజ్ చేశారు. వాహనం నంబర్ ప్లేట్లపై అంకెలు కనిపించకుండా ట్యాంపరింగ్ చేయడం, స్టిక్కర్లు, మాస్కులు పెట్టడం వంటివి చేస్తే ఎంవీ యాక్ట్ ప్రకారం.. ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ హెచ్చరించారు.