హయత్నగర్ : ఇంటి నుండి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ కేంద్రంలోని బ్యాంక్ కాలనీకి చెందిన సూర్య రాము(24), వృత్తిరీత్యా కోళ్లకు ఇంజెక్షన్లు వేస్తుంటాడు.
ఏప్రిల్ 29న ఉదయం ఇంటి నుండి హయత్నగర్, ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రానికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాము ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేదు. తండ్రి సూర్య శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.