పహాడీషరీఫ్ : వేరు ఘటనల్లో ఇద్దరు అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామకాలనీలో నివాసముంటున్న పునీత్ శర్మ(20) గగన్పహాడ్లోని మంజీర ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు.
31న సాయంత్రం 7 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లి వస్తానని వెళ్లాడు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. కంపెనీకి పోన్ చేస్తే డ్యూటీకి రాలేదని చెప్పారు. పలు చోట్ల వెతికినా ఆతని అచూకి లభించకపోవడంతో తండ్రి శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరో ఘటనలో యువతి అదృశ్యం
ఎస్సై హయ్యూం వివరాల ప్రకారం తుక్కుగూడ గ్రామంలో నివాసముంటున్న సురేఖ(17) ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదువుకుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నుంచి ఇంట్లోనే ఉంటుంది. సోమవారం తెల్లవారు జామున 4 గంట లకు ఆమె తల్లి సుజాత పూల మార్కెట్కు వెళ్లాడానికి నిద్ర లేచింది.
కూతురు కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల. స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకి లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.