మలక్పేట, జనవరి 23 : మలక్పేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలకు విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రభుత్వం సర్కిల్-6 పరిధిలోని ముసారాంబాగ్, పాత మలక్పేట, సైదాబాద్, అక్బర్బాగ్, ఆజంపురా, ఛావునీ, డబీర్పురా, పత్తర్గట్టి డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నది. సర్కిల్-6 పరిధిలోని 9 డివిజన్లలో సోమవారం 1268 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 626 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి 368 మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేశారు. సోమవారం ప్రజలు కంటి పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముసారాంబాగ్ డివిజన్లోని శ్రీపురం కాలనీ కమ్యూనిటీహాలులో 165 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలున్న 90 మందిని గుర్తించారు. 34 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు.
పాత మలక్పేట డివిజన్లోని సాలార్ యే మిల్లత్ కమ్యూనిటీ హాలులోని కేంద్రంలో 136 మందికి కంటి పరీక్షలు చేయగా, దృష్టిలోపం ఉన్న 72 మందిని గుర్తించి, 50 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. అలాగే ప్రిన్ బాడీగార్డు లేన్ కమ్యూనిటీ హాలులో 143 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా..92 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దృష్టిలోపం తక్కువగా ఉన్న 11 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. అక్బర్బాగ్ పల్టన్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీహాలులో 169 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 71మందిని కంటి సమస్యలున్నట్లుగా గుర్తించి, 53 మందికి రీడింగ్ కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆజంపురా డివిజన్లోని జట్పట్నగర్లో 121 మందికి పరీక్షలు నిర్వహించి, 81 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి, 47 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. చావునీ డివిజన్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీహాల్లో 123 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 82 మందికి దృష్టిలోపం సమస్యలు ఉన్నట్లు గుర్తించి 49 మందికి రీడింగ్ అద్ద్దాలను పంపిణీ చేశారు.
డబీర్పురాలోని మద్రసా తుల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగులో 105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 68 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించి, 47 మందికి రీడింగ్ గ్లాసులు, పత్తర్గట్టిలోని బాల్శెట్టి కేత్ ప్లే గ్రౌండ్లో 103 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 40 మందికి కళ్లద్దాలు అందజేశారు. సైదాబాద్ మహిళా సంఘం కమ్యూనిటీహాలులో 203 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా, 27 మంది దృష్టిలోపంతో ఉన్నట్లు గుర్తించి 37 మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేశారు. మలక్పేట నియోజకవర్గంలో దృష్టిలోపం ఎక్కువగా ఉన్న వారికి అద్దాలను తయారు చేయిస్తున్నారు. కంటి పరీక్షల కోసం వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ బిర్జిస్ ఉన్నీసా తెలిపారు.