మాదాపూర్ : పార్క్ను సుందరవనంగా తీర్చిదిద్ది, పార్క్లో గ్రీనరీ ఏర్పాటుతో పాటు పిల్లలకు ఆటస్థలం అందుబాటులో ఉండేలా చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పా పార్క్లో నూతనంగా నిర్మించిన పార్క్ను స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ఉదయ క్రెసెంట్ బిల్డర్స్ అధినేత రాజశేఖర్ తన స్వంత నిధులతో సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకొని పార్క్ను నిర్మించి అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేస్తు ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేయాలని అన్నారు.
శిల్పాపార్క్లోని పార్క్ను అభివృద్ధి చేయడం వల్ల కాలనీ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్తో కలిసి పార్క్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శిల్పాపార్క్ వాసులు, రాజశేఖర్, నరేంద్రబాబు, చంద్రశేఖర్రెడ్డి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.