మాదాపూర్, మే 24: సాంకేతికత ఆధారంగా వేగంగా, సమర్థవంతంగా, తక్కువ ధరకు కొత్త ఔషధాల ఆవిష్కరణను అనుమతించవచ్చని డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ సీఈఓ దీపక్ సుప్రా అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన డీఎక్స్ఎం 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ సీఈఓ దీపక్ సుప్రా, సీఐఎం డేటా సీఈఓ, అధ్యక్షుడు పీటర్ బిలెల్లో హాజరై మాట్లాడారు. మెషిన్ లెర్నింగ్ వంటి అనేక నూతన తరంగాల సాంకేతికతలతో, ఔషధ, మాలిక్యూలర్ డేటా రెండింటిలోను విస్తృతమైన డేటాను స్వయం చాలకంగా సంక్లిష్ట నమూనాలను రూపొందించడానికి ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ తరహా ప్రక్రియ ఆవిష్కరణను మరింత సులభతరం చేయనుండటంతో పాటు శరీరంలో మందులు ఏ విధంగా పనిచేస్తాయో అంచనా వేయడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఔషధాల ఆవిష్కరణ చాలా క్లిష్టమైన వ్యవహారమని, దీనికి 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదన్నారు.
యూఎస్ 2 బిలియన్, 16 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మన ఆరోగ్య సంరక్షణ మొబైల్ ఫోన్లో ఉండటం, అతిపెద్ద డయాగ్నస్టిక్ పరికరం మన మొబైల్ అని పేర్కొన్నారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు రోగ నిర్ధారణ, చికిత్స ఎంపికలో వైద్యులకు సహాయం చేయడానికి రూపొందించబడిందని చెప్పారు. వ్యాధులను నిర్ధారించడంలో వైద్యులకు సహాయం చేయడానికి ఉపయోగించబడుతుందన్నారు. ఇద్దరు రోగుల డేటాపై పనిచేసే విప్లవాత్మక ఉత్పత్తులు యూజర్ ఫ్రెండ్లీ కానందున విఫలమైనట్లు తెలిపారు. పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా భారతదేశంలో వ్యక్తీకరించిన మందులపై పరిశోధన జరుగుతున్నట్లు వివరించారు. క్లినికల్ ట్రయల్స్ ఉపయోగించే జంతువుల అనుకరణ మోడ్ల ద్వారా భర్తీ చేయవచ్చన్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. తయారీలో డిజిటలైజేషన్ను స్వీకరించడం వల్ల 2025 నాటికి భారతదేశ జీడీపీకి 1.04 ట్రిలియన్ డాలర్లు జోడించవచ్చని పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని సూచిస్తుందన్నారు. దక్షిణ కొరియా తన లాభాల్లో 5.2 శాతం ఆర్అండ్ డీ కోసం ఖర్చు చేస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా భారతదేశం కేవలం 0.8 శాతం ఖర్చు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, యువ వైద్యులు తదితరులు
పాల్గొన్నారు.