వెంగళరావునగర్ : ఆదివారం రోజున కూడా తరగతులు నిర్వహిస్తున్నారనే కారణంతో యూసుఫ్గూడ శ్రీ చైతన్య కళాశాల పై కొందరు యువకులు రాళ్ల దాడి చేశారు. సంఘటనలో కళాశాల అద్దాలతో పాటు ఇన్చార్జ్ ఎ.రమేష్కు గాయాలయ్యాయి. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
ఆదివారం కూడా తరగతులు నిర్వహిస్తున్నారంటూ ఏబీవీపీ కార్యకర్తలుగా చెప్పుకున్న ఐదుగులు యువకులు, ఓ యువతి కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని కళాశాల ఇన్చార్జ్ ఎ.రమేష్ చెప్పినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు.
రాళ్లతో దాడి చేయడంతో కళాశాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. హేమంత్ అనే యువకుడు ఓ రాడ్డుతో కొట్టడంతో తనకు కంటి పై భాగంలో తీవ్రగాయాలయ్యాయని, బాధితుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని 6 మంది ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలి