తెలుగు యూనివర్సిటీ, జూన్ 7: ప్రజా కవి సుద్దాల హనుమం తు పాటలు అజరామరం అని ప్రముఖ దర్శక, నిర్మాత నరసింగరావు అన్నారు. సుద్దాల ఫౌండేషన్, తేజ సాహిత్య సేవా సంస్థ సంయుక్తాధ్వర్యంలో ప్రజాకవి సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా జూమ్ యాప్ వేదికగా ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింగరావు మాట్లాడారు. నాటి సామాజిక పరిస్థితులను ప్రజా సాహిత్యంగా తనదైన శైలిలో అందించిన ఘనత హనుమంతుకు దక్కుతుందన్నా రు. ‘మా భూమి’ సినిమాలో ‘పల్లెటూరి పిల్లగాడా’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని గుర్తు చేశారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఉద్య మం తెలంగాణ ప్రాంతంలో మమేకమైందని, అణచివేత ఎదురైన ప్రతి సందర్భంలో కవులు, కళాకారులు తమదైన రీతిలో సాహి త్యం, కళా ప్రదర్శనలతో ఎదురించారన్నారు. సుద్దాల హనుమం తు వారసుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ స్వాగతోపన్యాసం చేశారు. తేజ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు డా॥ పోరెడ్డి రంగయ్య సమన్వయకర్తగా వ్యవహరించి న కార్యక్రమంలో ప్రముఖ కవి హరగోపాల్, గాయని రచ్చ భార తి, కవి, గాయకుడు సుద్దాల ప్రభాకర్ తేజ, సత్యనారాయణ, డా॥ కృష్ణ కౌండిన్య, ఆచార్య పిల్లలమర్రి రాములు పాల్గొన్నారు.