వెంగళరావునగర్ : ఆపి ఉన్న ఆటో చోరీకి గురైన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బీకేగూడ ఎల్ఐజీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బి.శ్రీనివాస్ రావు ప్రతీ రోజు మాదిరిగానే ఈ నెల 11వ తేదీన రాత్రి 10 గంటలకు తన ఆటోను ఈఎస్ఐ ఫ్యామిలీ క్వార్టర్స్ వద్ద ఆటోను నిలిపి ఉంచాడు.
ఆదివారం వెళ్లి చూసుకుంటే ఆటో కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేక పోవడంతో పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.