హైదరాబాద్: నగర శివార్లలోని దుండిగల్లో దారుణం చోటుచేసుకుంది. దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో ఓ బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తతో విడిపోయిన ఓ మహిళ మరో వ్యక్తితో మల్లంపేటలో గత పదేండ్లుగా సహజీవనం చేస్తున్నది. ఆమెకు 12 ఏండ్ల వయస్సున్న కూతురు ఉన్నది. ఆమెకు తెలియకుండా ఆ మైనరు బాలికపై (Minor girl) మారుతండ్రి గత కొన్నిరోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది.
ఈ క్రమంలో ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో.. తల్లి ఆమెను దవాఖానకు తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. బాలికను నియడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.