హైదరాబాద్ : పాశి నోట సంపాదిస్తే బంగారు నోట తిన్నట్లుగా అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది ప్రైవేట్ ఫైనాన్స్లో కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. తీర సదరు సంస్థలు బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లు(Rs.200 crores )కాగేజేసిన సంఘటన అబిడ్స్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..అబిడ్స్ లోని(Abids) శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్(Sri Priyanka Enterprises) అనే సంస్థ తమ వద్ద పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి 517 మంది బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు న్యాయం చేయాలని బషీర్బాగ్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.