సిటీబ్యూరో/మేడ్చల్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): మహా నగరంలో బడి గంట మోగడానికి వేళయ్యింది. నేటి నుం చే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనుండగా, దీంతో బడి గంట మోగనుం ది. విజ్ఞాన ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఎప్పుడెప్పుడు స్కూల్కు వెళదా మా..ని ఎదురుచూసిన విద్యార్థుల ఆశలు మరికొద్ది గంటల్లో నెరవేరబోతున్నా యి. ఆన్లైన్ తరగతులతో ఇంట్లోనే మానసికంగా కుంగిపోయిన విద్యార్థులకు పాఠశాలలు తెరుచుకోనున్న వార్త మంచి జోష్ ను ఇచ్చింది. సెల్ఫోన్ చదువులతో విసిగిపోయిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో బడిలో అడుగుపెట్టబోతున్నారు. స్నేహితు లు, టీచర్లను కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడుకునే అవకాశం వస్తుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా మూతపడ్డ విద్యా సంస్థలు మళ్లీ యథావిధిగా కొనసాగనున్నాయి. ఇటీవల ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు కరోనా జాగ్రత్తలు పాటించడంపై దృష్టి సారించాయి. కాగా, హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు గురుకుల, సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్ట ల్స్ మూసివేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు స్కూల్ కు వెళ్లడం కోసం ఇప్పటికే విద్యార్థులు స న్నద్ధమయ్యారు. బ్యాగ్స్, పుస్తకాలు, నోట్బుక్స్ కొనుగోలు చేశారు. అయితే, ఇంత కాలం కొనసాగుతున్న ఆన్లైన్ తరగతు లు, ఆఫ్లైన్తో పాటు కొనసాగనున్నాయి.
కొవిడ్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అన్ని పాఠశాలల యాజమాన్యా లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకు మాస్కుల పంపిణీ, శానిటైజర్లు అందించడం, తరగతి గదుల శానిటైజేషన్ను విధిగా యాజమాన్యాలు పాటించనున్నాయి. స్కూళ్లో ఒక్కరికి పాజిటివ్గా తేలినా.. పక్కన కూర్చొన్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు వైరల్ ఫీవర్ సహా ఎలాంటి జ్వరం లక్షణాలున్నా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీపీసీఆర్తో పాటు, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు స్కూ ళ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. తరగతి గదులు, బెం చీలు, కిటికీలు, టాయిలెట్లు, నల్లా లు, హ్యాండ్ వాష్ సింక్లు, తాగునీటిట్యాంకులు, ఓవర్హెడ్ ట్యాం కులు, సంపులు ఇలా అన్నింటి వద్ద శు భ్రం చేయించారు. ట్యాంకుల్లో పేరుకుపోయిన చెత్త, నిల్వ నీటిని తొలగించారు. పా ఠశాల ప్రాంగణాలను శానిటైజేషన్ చేశా రు. విద్యార్థులు, బోధన, బోధనేతర సి బ్బంది అంతా మాస్కులు ధరించడం త ప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళ న చెందాల్సినవస రం లేదు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాఠశాలల ఆవరణలతో పాటు తరగతి గదులను శానిటైజేషన్ చేశాం. భౌతిక దూరం పాటించేలా పర్యవేక్షిస్తూ పాఠాలను బోధిస్తాం. మిడ్ డే మీల్స్ను ప్రతి పాఠశాలలో నేటి నుంచే అమలు చేస్తున్నాం. – ఎన్.ఎస్.ఎస్ ప్రసాద్, విద్యాధికారి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా