రవీంద్రభారతి, అక్టోబర్ 17: యువకళావాహిని ఆధ్వర్యంలో సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు శత జయంతి వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి, ఆత్మీయ అతిథిగా సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి హాజరయ్యారు. సాలూరి రాజేశ్వరరావు కుమారులు ప్రముఖ సంగీత దర్శకులు పూర్ణచంద్రరావు, కోటేశ్వరరావుల సమక్షంలో లలిత సంగీతం గంధ్రకర్త మహాభాష్యం చిత్తరంజన్, ప్రముఖ సినీ గాయని విజయలక్ష్మీశర్మకు ‘సాలూరి రాజేశ్వరరావు- సంగీత సుధానిధి’ పురస్కారాలను రమణాచారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక బంధు సారిపల్లి కొండల్రావు, గురువారెడ్డి, సినీనటి రోజారమణి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.