ఆర్ధిక సాయం అందజేసిన ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ రమణాచారి
సుల్తాన్బజార్, అక్టోబర్ 21: దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సభ్యులు, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి అన్నారు. ఈ మేరు భోలక్పూర్ దేవస్థానంలో అర్చకుడి కుమార్తెకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మెదడుకు గాయం కావడంతో ప్రైవేట్ దవాఖానలో చేర్పించడంతో ఆర్ధికంగా సహాయం నిమిత్తం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో లక్షా 70 వేలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి చేతుల మీదుగా అర్చకుడికి అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్ కేవీ రమణాచారి ప్రైవేట్ దవాఖానకు ఫోన్ చేసి అర్చకుడి కుమార్తెకు మెరుగైన వైద్యం అందజేయాలని తెలియజేయడంతోపాటు ఫైనల్ బిల్లులో డిస్కౌంట్ చేయాలని సూచించారు. ఈసందర్భంగా అర్చకుడు మాట్లాడుతూ, తన కుమార్తె వైద్యానికి పెద్ద మనసుతో ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు పరాశరం రవీంద్రాచార్యులు, గంగు ఉపేంద్ర శర్మ పాల్గొన్నారు.