తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 6: ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య నేటి తరం సాహితీవేత్తలకు స్ఫూర్తిదాయకమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యం లో ఆచార్య స్మారకోపన్యాస కార్యక్రమం వర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి మాట్లాడుతూ సాహిత్యమే జీవితంగా సంపత్కుమారాచార్య తన జీవితాన్ని కొనసాగించారన్నారు. పద్య కవిత్వంలో, సాహిత్యం లో పరిశోధనకు సంపత్కుమారాచార్య స్ఫూర్తిని కలిగించారని రమణాచారి గుర్తు చేశారు. వర్సిటీ వీసీ ఆచార్య టి.కిషన్ రావు అధ్యక్షత న జరిగిన సభలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు పాల్గొని సంపత్కుమార ‘పద్యాలు-ప్రయోగాలు’ అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు.