HomeHyderabadRachakonda Cybercrime Inspector Narsimhaswamy That Cybercrime Frauds Can Be Stopped
అప్రమత్తతతో సైబర్ నేరాలకు చెక్
అప్రమత్తంగా ఉంటే సైబర్ క్రైమ్ మోసాలను అరికట్టవచ్చని రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపారు. మంగళవారం డిఫెన్స్కాలనీ కార్యాలయంలో సైబర్ నేరాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నేరేడ్మెట్, మే 23: అప్రమత్తంగా ఉంటే సైబర్ క్రైమ్ మోసాలను అరికట్టవచ్చని రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపారు. మంగళవారం డిఫెన్స్కాలనీ కార్యాలయంలో సైబర్ నేరాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మొబైల్ యాపులు, గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు స్పందించి మోసపోవద్దని చెప్పారు. విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నారని, ఎటువంటి ఆధారం లేకుండా రుణాలు ఇస్తామని, మీకు లాట రీ తగిలిందని వచ్చే సందేశాలకు సమాధానం ఇవ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు అంతర్జాతీయ వాట్సాప్ కాల్స్ చేస్తున్నారని, దానికి సమాధానం ఇవ్వద్దని కోరారు. సైబర్ నేరగాళ్లు పలు యాప్ల ద్వారా ఫోన్ చేస్తూ మోసాలకు పా ల్పడుతున్నారని, ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే వెం టనే 1930కు ఫిర్యాదు చేయాలని, లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి బదిలీ అయిన సందర్భంగా ఆయనను, నూతన ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్న నాగరాజును డిఫెన్స్కాలనీ సొసైటీ సభ్యులు సత్కరించా రు. ఇక్కడ పనిచేసిన కాలంలో శాంతి భద్రతలకు విఘా తం కలగకుండా ప్రజలు పోలీసు సిబ్బంది సహకారంతో నేరాలను నియంత్రించగలిగామని అన్నారు.
నేరేడ్మెట్ నూతన ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. పోలీస్లకు వచ్చే ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎస్సై శ్రీనివాస్, డిఫెన్స్కాలనీ అధ్యక్షుడు నిమ్మగడ్డ విజయసారధి, సెక్రటరి శివయ్య, ఎన్జీ రావు, రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.