బడంగ్పేట, డిసెంబర్ 28 : భవిష్యత్ తరాల కోసం చెరువులను కాపాడుకోవలసిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి పి . సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును మంత్రి సబితారెడ్డి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్జైన్తో కలిసి బుధవారం పరిశీలించారు. రూ. 1.80 కోట్లతో చేపడుతున్న చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. పనలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులో ఉన్న గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే విహంతరి రోబో టిక్ ట్రాష్కలెక్టింగ్ బోటును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువు ఎఫ్టీఎల్ను గుర్తించి చెరువులను సుందరీకరణ చేయిస్తున్నట్లు తెలిపారు. యువ శాస్త్రవేతగా ఒక యువకుడు సోలార్ సహాయంతో రిమోట్ కంట్రోల్తో పనిచేసే నూతన యంత్రాన్ని కనుగొన్నారని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా తయారు చేశాడని, నూతన ఆవిష్కరణలు చేస్తున్న వారిని ప్రోత్స హించాలని అన్నారు. మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను సుందరీకరిస్తామని తెలిపారు. చెరువులలో చెత్త, గుర్రపుడెక్కను పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పారు.
మురుగు నీరు చెరువులోకి రాకుండా రూ. 23 కోట్లతో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, వర్షం నీళ్లు మాత్రమే చెరువులోకి పోయో విధంగా తయారు చేశామని అన్నారు. ప్రజలు బాధ్యతగా చెరువులను కాపాడుకోవాలని ఆమె సూచించారు. చెరువులను అభివృద్ధి చేస్తుంటే జీర్ణించుకోలేక కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి వారికి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. మంత్రిని కలువడానికి ఎవరు వచ్చినా బోకేలు, శాల్వలు తీసుకు రాకుండా పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలను తీసుక రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.
కందుకూరు : ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొత్తగూడ. నేదునూరు, కందుకూరు ఎక్స్రోడ్డులలో జరిగిన అయ్యప్ప ఇరుముడి పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అయ్పప్పలు మంత్రిని సన్మానించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు, కన్వీనరు ఎల్మటి దేవేందర్రెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, గురుస్వాములు పాల్గొన్నారు.