ఖైరతాబాద్, జనవరి 10 : కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వశాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజాలో జాతీయ చేనేత ఎక్స్పో, గాంధీ బంకర్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కే. సునీత, కమిషనర్ ఎంఎం నాయక్తో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు.
పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట పట్టుచీరలు, కొయ్యలగూడెం, టై అండ్ డై, కరీంనగర్, హుజురాబాద్ దుప్పట్లు, వరంగల్ డార్సీస్ (రగ్గులు), ధర్మవరం, ఉప్పాడ, పొందూరు కాటన్ సిల్క్ షర్టింగ్స్, వెంకటగిరి, మంగళగిరి చీరలు, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, జమ్మూ కశ్మీర్ వస్త్రశ్రేణులను అందుబాటులో ఉంచారు.