ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 10: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బహుజ న చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ను జై గౌడ్ ఉద్యమం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంత రం, రామారావు గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పాపన్న మహారాజ్ యూనివర్సిటీగా నామకరణం చేయాలన్నారు. యూజీసీ ఆధ్వర్యంలో ఓ యూలో పాపన్న మహారాజ్ అకాడమిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశా రు. పాపన్న చరిత్రను కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ సిలబస్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఔరంగజేబు మార్గ్ను తొ లగించి, పాపన్న మహారాజ్ మార్గ్గా చే యాలన్నారు. పాపన్న కోటలను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిరక్షించాలని, ఢిల్లీలో పాపన్న పేరుతో స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరారు. పోస్టల్ ఎన్వలప్ కాకుండా పోస్టల్ స్టాంప్ పై పాపన్న ఫొటో ముద్రించాలన్నారు. దే శానికి అందించిన సేవలకు గుర్తుగా మరణానంతరం ఇచ్చే భారతరత్నను పాపన్న కు ఇచ్చేలా కృషి చేయాలన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి తమ డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చా రన్నారు. జై గౌడ్ ఉద్యమం ఏపీ అధ్యక్షుడు చిట్టిబొమ్మ కిశోర్ గౌడ్, జాతీయ కోఆర్డినేటర్ రాజా నాడార్ పాల్గొన్నారు.