Sabitha Indra Reddy | ఆర్కేపురం, మే 9 : ప్రభుత్వంలో ఉంటేనే పని చేయాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్నా.. కొట్లాడి సాధించే శక్తి ప్రజలు తనకు ఇచ్చారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్కు మద్దతుగా గురువారం డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్నగర్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ మంత్రులు పాలన మరిచి.. కేసీఆర్ను తిట్టడానికి పోటీపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.