వ్యవసాయ యూనివర్సిటీ ఆగస్టు 6 : కరోనా థర్డ్వేవ్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదని, తగు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డా. రాజయ్య అన్నారు. శుక్రవారం రాజేంద్ర నగర్లోని ఓ స్వచ్చంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. తొలి టీకాకు 50 శాతం, రెండో టీకా 80 శాతం వరకు కరోనా రాకుండా నివారించగలదన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో కో ఆపరేటివ్ సొసైటీల పాత్ర ఉందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డా. రాజయ్య అన్నారు. శుక్రవారం రాజేంద్ర నగర్ లోని టీఎస్ క్యాబ్- సీటీఐ ఆడిటోరియంలో ముద్ర అగ్రికల్చర్, స్కిల్ డెవలప్మెంట్ మల్టీస్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన సహకార మంత్రిత్వశాఖకు సహకార జనుల సూచనలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దానికి ఆయన పట్టుదల, నిరంతర కృషి అని గుర్తుచేశారు. కార్యక్రమంలో ముద్ర మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, పూర్వపు బీసీ కమిషన్ స భ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ముద్ర అగ్రి సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు తదితరులు