శంషాబాద్, సెప్టెంబర్ 3: శంషాబాద్ మున్సిపల్లోని ఆయా వార్డుల టీఆర్ఎస్ నూతన కార్యవర్గాలను నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాలకు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని 4,5,6,14 వార్డుల కమిటీలను ఎన్నుకున్నారు. 6 వ వార్డు అధ్యక్షడిగా హరిగౌడ్, ఉపాధ్యక్షులుగా రవి, సలావుద్దీన్, శ్రావణికుమారి, సురేశ్, జనరల్ సెక్రటరీగా మంచర్ల రవి, కార్యదర్శులుగా యాదగిరి, అనిల్, హరీశ్, దేవరాజ్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్, మాజీ సర్పంచ్ గణేశ్గుప్తా, కౌన్సిలర్లు కుమార్, రేఖాగుప్తా పాల్గొన్నారు.
బండ్లగూడ,సెప్టెంబర్ 3: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. కిస్మత్పూర్ గ్రామానికి చెందిన రేణుక, చంద్రయ్యలకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, సురేశ్గౌడ్ పాల్గొన్నారు.