బండ్లగూడ/శంషాబాద్ రూరల్, జూలై 15 : పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కిస్మత్పూర్, పీరంచెరువు గ్రామస్తులకు సీఎం సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటున్న పేదలను ఇతోధికంగా ఆదుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధితో పాటు వారి సంక్షేమానికి పాటు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, రావులకోళ్ల నాగరాజు, అన్నపురెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, మల్లేశ్యాదవ్, జగదీశ్, ప్రవీణ్, శ్రీకాంత్, శంకర్గౌడ్, పాండు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామానికి చెందిన పి.వెంకటయ్యకు 14వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్రావు, సీనియర్ నాయకుడు నీరటి రాజుముదిరాజ్, వెంకటయ్య, ఉప సర్పంచ్ ప్రభాకర్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.