చిక్కడపల్లి, జూన్ 22: అర్హులైన వారందరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి కేబీఎన్ చౌరస్తా వద్ద సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులు సంధ్యకు రూ.60 వేలు, శ్యామ్రావుకు రూ.60 వేలు, జ్యోతికి రూ.20వేలు , నర్సింగ్రావుకు రూ.14 వేలు, కృష్ణవేణికి రూ.38 వేలు, వి.స్వామికి రూ. 60 వేలు, రాములమ్మకు రూ.30 వేలు, నారాయణకు రూ.38 వేలు, సంతోష్ కుమార్కు రూ.17,500 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు వైద్యం అందించడానికి సీఎంఆర్ఎఫ్ ఎంతో తోడ్పాటునందిస్తోందని, ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య సంజీవని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఠా జైసింహ, నాయకులు వెంకటకృష్ణ, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వివేక్, సీనియర్ నాయకులు మన్నె దామోదర్రెడ్డి, రాజేందర్ ప్రసాద్గౌడ్, ఆర్. మోజెస్, కందూరికృష్ణ, నాగభూషణం, శివకుమార్యాదవ్, ఇంద్రసేనారెడ్డి, ఎం. మురళి, ముచ్చకుర్తి ప్రభాకర్, జనార్దన్, ఎం.వి. జనార్దన్, కల్యాణ్నాయక్, న్యాయవాదిరాజు, శ్రీధర్రెడ్డి, పాశం శ్రీను, ఆనంద్, కూరగాయల శ్రీను, నేత శ్రీను, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.