అంబర్పేట/ కాచిగూడ, జూలై 30: తెలంగాణ ప్రజ లు కుల, మతాలకు అతీతంగా బోనాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రభుత్వ అదేశాల మేరకు శుక్రవారం కాచిగూడ డివిజన్లోని ఆలయాల నిర్వాహకులకు బోనాల చెక్కులను ఎమ్మెల్యే వెంకటేశ్, కార్పొరేటర్ ఉమాదేవితో కలసి పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఏటా ప్రభుత్వం బోనాల సందర్భంగా దేవాలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నె రమేశ్యాదవ్, బి.కృష్ణాగౌడ్, ఎర్ర భీష్మా, నాగేందర్బాబ్జి, బబ్లూ, రవియాదవ్, రమాదేవి, భీంరాజ్, పంకజ్, దీపక్, కలియా, హరిసింగ్ పాల్గొన్నారు.
అంబర్పేట : అంబర్పేట మహంకాళి దేవాలయం వద్ద ఆగస్టు 1, 2 తేదీలలో జరిగే అమ్మవారి బోనాల ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు, రంగం కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. నెల రోజుల ముందు నుంచే అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యం గా బోనాలు ఎత్తుకొని వచ్చే మహిళలకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాజీ కార్పొరేటర్లు పి.జ్ఞానేశ్వర్గౌడ్, బి.వెంకటరెడ్డి, దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు జె.సత్తిబాబు, ఉపాధ్యక్షుడు పి.చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములుముదిరాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి సుధాకర్, కార్యదర్శి గడ్డం శ్రీధర్గౌడ్, కోశాధికారి వి. మహేందర్రెడ్డి, వివిధ పార్టీల నాయకులు మధుసూదన్రెడ్డి, శశిధర్, అనిల్రెడ్డి, గణేశ్, ప్రవీణ్, సాయి, కిరణ్, సునీల్, బాలకృష్ణ పాల్గొన్నారు.