భారీ వర్షాలకు అస్థవ్యస్థమైన డ్రైనేజీ స్థానంలో నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలో రూ. రెండు కోట్లతో ఎల్బీనగర్ మజీద్గల్లి, దానాపురం, విజయపురికాలనీ, గణేశ్నగర్, గ్రీన్పార్క్ కాలనీలో యూజీడీ పైప్లైన్, కామేశ్వరరావు కాలనీలో ట్రంక్లైన్ పనులను మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే వానాకాలం నాటికి ఏ కాలనీలో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా పనులను పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే పలు కాలనీల్లో డ్రైనేజీ పైప్లైన్లలో పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులు జరుగుతున్నాయని తెలిపారు. గ్రీన్పార్క్ కాలనీలో డ్రైనేజీ లైన్కు అడ్డంగా ఉన్న మంచినీటి పైప్లైన్కు ప్రత్యేక లైన్ వేసి డ్రైనేజీ నీరు సాపీగా వెళ్లేందుకు పనులు చేపడుతామని అన్నారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు తిలక్రావు, మల్లారపు శ్రీనివాస్, అడాల రమేశ్, బెల్దె నర్సింహాగుప్తా, కందికంటి శ్రీధర్గౌడ్, భాస్కర్గంగపుత్ర, తోట రాజశేఖర్రెడ్డి, ఉప్పల శ్రావణ్కుమార్గుప్తా, మధుసాగర్, ప్రవీణ్రెడ్డి, కాలనీవాసులు ఎల్లారెడ్డి, మురళిగౌడ్, కమలేష్రెడ్డి, బాల్రెడ్డి, మహిపాల్రెడ్డి, నర్సిరెడ్డి, మోహన్రెడ్డి, శ్రీదేవి, నర్సింహాగౌడ్ పాల్గొన్నారు.
ఇన్నాళ్లు కనిపించని ప్రతిపక్ష నాయకులు ఎన్నికలు రాగానే డివిజన్ ప్రజలపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆరోపించారు. పనిచేసే వారిపై ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఎన్నికల అనంతరం గ్రీన్పార్క్ కాలనీ ఎఫ్టీఎల్ సమస్యపై కాలనీవాసులతో కలిసి మంత్రి కేటీఆర్తో సమావేశానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
భవిష్యత్లో వరదనీటితో ముంపు సమస్యలు రాకుండా ట్రంక్లైన్ను నిర్మిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో జడ్జెస్కాలనీ ఫేజ్-1 నుంచి సహారా కాలనీ గుండా రూ. 1.94 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వరదనీటి ట్రంక్లైన్ నిర్మాణంతో సమస్యలు వస్తాయని అనుమానాలతో ఉన్న సహారా కాలనీవాసులతో సోమవారం కాలనీలోని క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సహారా కాలనీ గుండా ఏర్పాటు చేస్తున్న ట్రంక్లైన్లో కేవలం వరదనీరు దిగువకు వెళ్తుందని, డ్రైనేజీ నీరు కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. సహారాస్టేట్స్ కాలనీవాసుల అభిప్రాయాలను పరిగణనలోని తీసుకుని వారి నిర్ణయం మేరకు ట్రంక్లైన్ను నిర్మిస్తామని తెలిపారు. కాలనీలో వీధి దీపాల ఏర్పాటు, రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ తదితర సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, కాలనీ అధ్యక్షుడు సయ్యద్ జానీ, ప్రధాన కార్యదర్శి సుదర్శన్రెడ్డి, ఉపాధ్యక్షురాలు మంజుల రాహుల్, కాలనీవాసులు వల్లూరిపల్లి పార్థసారథి, వెంకటాద్రి, కరణం శ్రీకాంత్, బాల్రెడ్డి, జ్ఞానేశ్వర్, బీవీ పంతులు, రవిచంద్ర, నాయకులు పోచబోయిన జగదీశ్యాదవ్, సిద్దగౌని జగదీశ్గౌడ్ పాల్గొన్నారు.