చర్లపల్లి, జనవరి 7 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిం చి.. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, చక్రీపురంకు చెందిన కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ నాయకులు శనివారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న స మస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని, పలు కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. చక్రీపురం కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేయడంతోపా టు రహదారుల నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించనున్నట్లు అన్నారు.
కాలనీల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మొగిలి రాఘవరెడ్డి, కట్కూరి బుచ్చిరెడ్డి, ఉపాధ్యక్షుడు కొండారెడ్డి, సోమగాని అశోక్, సంయుక్త కార్యదర్శులు జగన్మోహన్రెడ్డి, మురళి, కార్యనిర్వహక కార్యదర్శి ఎర్రయ్య, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.