ఉప్పల్, ఆగస్టు 25 : అభివృద్ధి, సంక్షేమం దిశగా నిరంతరం శ్రమిస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని సాయిరాంనగర్ కాలనీలో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్తో కలిసి బుధవారం ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసుతల కల్పనతోపాటు, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు పూర్తిచేస్తున్నామని చెప్పారు. అనంతరం చిలుకానగర్ వార్డు కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి కిట్లు పంపిణీ చేశారు. టీచర్స్ కాలనీ కమ్యూనిటీహాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న టీచర్స్ కాలనీ, సాయిరాఘవేంద్ర నగర్, హైకోర్టు కాలనీ, రాఘవేంద్రనగర్ కాలనీలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కల్యాణపూరి కమ్యూనిటీహాల్లో మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్, వీబీ.నర్సింహ, పల్లె నర్సింగ్రావు, కొండల్రెడ్డి, రవీందర్రెడ్డి, రాంరెడ్డి, వెంకటేశ్, జగన్, శేఖర్, శ్రీనివాస్, సుందర్, రవీందర్, పుష్పరాజ్, తిరుపతి, మహ్మద్ పాల్గొన్నారు.
చర్లపల్లి, ఆగస్టు 25 : ఏఎస్రావునగర్ డివిజన్ సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే సుభాష్రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని బుధవారం మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్రెడ్డి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా వర్షం నీరు నిలువకుండా నాలాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మణిపాల్రెడ్డి, చారి, రెడ్డినాయక్ ఉన్నారు.
కాప్రా, ఆగస్టు 25: హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో మాధవకు రూ.2 లక్షలు, ప్రవీణ్కు రూ. 60 వేలు, శేఖర్బాబుకు రూ.37 వేలు, శివనాయక్కు రూ.14వేలు, శివనీలకు రూ.12వేలు, ఆర్.శ్రీధర్కు రూ.10 వేల ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, వేముల వెంకట్రెడ్డి, సూరం శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.