అమీర్పేట్, ఆగస్టు 30 : టీఆర్ఎస్ జెండా పండుగను సెప్టెంబర్ 2 న నిర్వహిస్తున్నామని సనత్నగర్ నియోజకవర్గంలోని నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. సోమవారం ఉదయం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేచారు. ఢిల్లీలో నిర్మించ తలపెట్టిన టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.
నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ మాత్రమే చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ విజయాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, కొలను లక్ష్మీరెడ్డి, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, అత్తెల్లి అరుణగౌడ్, ఉప్పల తరుణి, డివిజన్ల అధ్యక్షులు అత్తెల్లి శ్రీనివాస్గౌడ్, కొలను బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట్ ఆగస్టు 30: నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం మారేడ్పల్లిలోని తన నివాసంలో బేగంపేట్ దేవుడి బస్తీకి చెందిన ఖలీల్ఖాన్కు రూ. 2 లక్షల ఎల్వోసీని కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి అందించారు. కొంత కాలంగా ఖలీల్ఖాన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, శ్రీనివాస్గౌడ్, శేఖర్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి పాల్గొన్నారు.