కీసర, నవంబర్ 8: మేడ్చల్ నియోజకవర్గంలో ఈసారి గెలుపు నాదేనని మంత్రి చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి కీసరకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి ముందుగా కీసరగుట్టలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రమేశ్శర్మ, వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి ఆలయంలోని ఆహ్వానించారు. గర్భాలయంలోని శ్రీ మూలవిరాట్స్వామివారికి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక అభిషేకం చేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో మంత్రిని ఆల య చైర్మన్ తటాకం రమేశ్శర్మ శాలువా సత్కరించారు. వేదపండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పథకాన్ని అర్హులకు అందించామన్నారు. మేడ్చల్లో కాంగ్రెస్, బీజేపీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నుంచి లక్ష మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. అనంతరం కీసరగుట్ట నుంచి నేరుగా మంత్రి మల్లారెడ్డి కీసరలోని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో రాజేశ్కుమార్కు నామినేషన్ పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో మేడ్చల్ బీఆర్ఎస్ నేతలు నందారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, మంద సంజీవరెడ్డి, సర్పంచ్ మాధురి వెంకటేశ్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నేతలు, మున్సిపాల్టీల బీఆర్ఎస్ నేతలు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే..తెలంగాణకు పెట్టుబడులు
జవహర్నగర్: బీఆర్ఎస్తోనే తెలంగాణలో అత్యధిక పెట్టుబడులు తీసుకువచ్చి, యువతకు ఉపాధి కల్పించామని బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం జవహర్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెంది న యువకులు కార్పొరేటర్ శారదామనోధర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ చేశారు. ఈ సందర్భం గా మల్లారెడ్డి మాట్లాడుతూ ఉద్య మ నాయకుడే సీఎం కావడంతో తెలంగాణ ప్రగతి చెం దిందని, మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జవహర్నగర్ కార్పొరేషన్లో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేస్తారన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి మల్లారెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.అదేవిధంగా జవహర్నగర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డిశెట్టి మహేశ్ ఆధ్వర్యంలో మేడ్చల్ బీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.