జవహర్నగర్, జనవరి 11: దేశ ప్రజలు…బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తే దేశం అభివృద్ధి చెంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం కార్పొరేషన్లోని 20వ డివిజన్లోని దేవేందర్నగర్లో జవహర్నగర్ వడ్డెర ఓబన్న కమిటీ ఆధ్వర్యంలో ఓబన్న జయంతిని పురస్కరించుకొని నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్తో కలిసి విగ్రహావిష్కరణ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సైరా నర్సింహారెడ్డి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన వడ్డె ఓబన్న వీరోచిత పటిమను స్మరించుకోవాలని, రాష్ట్రంలోని వడ్డెర్లంతా ఐక్యమై తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. జవహర్నగర్లో త్వరలోనే వడ్డెర సంఘం భవనానికి తను కృషి చేస్తానని అన్నారు.ఈనెల 18 నుంచి ప్రారంభయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరారు.
పేద విద్యార్థులు కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్ నా గుండెకాయ లాంటిదని, 2.50లక్షల జనాభాలో పేద ప్రజలే అధికంగా ఉన్నారని వారి సంక్షేమమే నా లక్ష్యమని అన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, సాయి, రవి, చిత్రసుబ్రమణ్యం, కో ఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచ్ శంకర్గౌడ్, జిల్లా నాయకులు అయ్యప్ప, శ్రీనివాస్, మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాజశేఖర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దయాకర్రెడ్డి, జాతీయ లేబర్ కమిషనర్ బోర్డు మెంబర్ రాజలక్ష్మి, తెలంగాణ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఐలమల్లు, జవహర్నగర్ అధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు మల్లేశ్, ప్రధాన కార్యదర్శి మహేశ్, దేవేందర్నగర్ అధ్యక్షుడు తిరుపతి, వడ్డెర సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.