ఉప్పల్, జూన్ 2: ‘మెట్రో రైల్ పనుల్లో భాగంగా చాయ్ డబ్బా కోల్పోయా. ప్రస్తుతం పని లేక ఇబ్బంది పడుతున్నా. కరోనా కాలంలో కుటుంబ పోషణ భారంగా మారింది. మీరే నాకు ఓ దారి చూపించాలి’ అని ఉప్పల్లో నివసించే శివారెడ్డి మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ ద్వారా వేడుకున్నాడు. దీంతో స్పందించిన మంత్రి కేటీఆర్ శివారెడ్డికి ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న చిలుకానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మంత్రి కేటీఆర్ సూచనతో శివారెడ్డికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చారు. అన్ని వస్తువులు కొనిచ్చి చాయ్ బండి ఏర్పాటు చేయించారు. ఈ టీ స్టాల్ను బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ రంగస్వామి, ఈఈ నాగేందర్, సీఐ గోవిందరెడ్డి, పీఓ ఇందిర, సిబ్బంది నర్సింగ్రావు, రాణి, సరిత, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్తో నా బాధను పంచుకున్నా. ఉపాధి కల్పించాలని ట్విట్టర్ ద్వారా వేడుకున్నా. వెంటనే స్పందించిన మంత్రి నా కుటుంబానికి అండగా నిలిచారు. జీవనాధారం కల్పించారు. ఎంతో పెద్ద మనసుతో ఇంత గొప్ప సాయం చేసిన మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా. నాకు బండి, సామగ్రి అందజేసిన ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా.