అబిడ్స్, సెప్టెంబర్ 23: ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీ నూతన కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలవ్వగా, అన్ని పదవులకు ఒకటి చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఈ మేరకు 30న అధికారికంగా ప్రకటించనున్నారు. సొసైటీ ఉపాధ్యక్షుడిగా అశ్విన్మార్గం, కార్యదర్శిగా సాయినాథ్ దయాకర్ శాస్త్రి, సంయుక్త కార్యదర్శిగా వనం సురేందర్, కోశాధికారిగా పాపయ్య చక్రవర్తితో పాటు 7 నామినేషన్లు దాఖలయ్యాయి.