హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: నర్సింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి నెలా ైస్టెపెండ్ను పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తమవుతున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ విద్యార్థులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభి షేకాలు చేశారు. ైస్టెపెండ్ పెంపుతో కష్టాలు తీరుతాయని, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు వీలవుతుందని వెల్లడించారు. నర్సింగ్ విభాగం అధికారులు, ప్రతినిధులు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ బీ విద్యుల్లత మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ైస్లెపెండ్ నిర్ణయం భరోసానిస్తుందని వెల్లడించారు. తమ కల నెరవేరేందుకు సహకరించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ వినోద్కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్రెడ్డికి తెలంగాణ నర్సెస్ అండ్ మిడ్వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ బీ విద్యావతి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ నర్సెస్ టీచింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సునిత, నర్సింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పద్మజయిని పాల్గొన్నారు.
జీఎన్ఎం, ఏఎన్ఎం, డిప్లొమా విద్యార్థులకూ వర్తింపు
పెంచిన ైస్టెపెండ్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకే కాక జీఎన్ఎం, ఏఎన్ఎం, డిప్లొమా విద్యార్థులకూ వర్తిస్తుందని ప్రభు త్వం తాజాగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 జీఎన్ఎం డిప్లొమా కాలేజీల్లోని 305 మందితో పాటు ఏఎన్ఎం కోర్సులను అందిస్తున్న 6 డిప్లొమా కాలేజీల్లోని 240కి ైస్టెపెండ్ పెరుగుతుందని వెల్లడించింది. మొత్తంగా 2,325 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం పేర్కొన్నది.
రాష్ట్ర వైద్యరంగంలో మరో మైలురాయి
ప్రజారోగ్యంపై చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఎన్ని వేల కోట్లయినా ఖర్చుచేసి వైద్య విధానాన్ని గాడిలో పెట్టి, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది. పలు కొత్త వైద్య కళాశాలలను ప్రకటించడంతోపాటు, డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకం, మౌలిక వసతులపై దృష్టి సారించింది. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన నర్సుల సేవలను మరింతగా విస్తృతం చేసేందుకు ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాకముందు 6 నర్సింగ్ కాలేజీలు 380 సీట్లు మాత్రమే ఉండేవి. నిమ్స్ కాలేజీలో 100 సీట్లు, ఉస్మానియాలో 60 సీట్లు, గాంధీలో 50 సీట్లు ,వరంగల్లో 80 సీట్లు, జగిత్యాలలో 40 సీట్లు, ఆదిలాబాద్లో 50 సీట్లు ఉండేవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదనంగా 14 కాలేజీలు, మరో 1,400 సీట్లు వచ్చాయి. మొత్తంగా 20 కాలేజీల్లో 1,780 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మంజూరైన కాలేజీల్లో మౌలిక వసతులకు రూ.590 కోట్లు, 816 రెగ్యులర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
నా కష్టాలు తీరినట్టే
సోమాజిగూడ నర్సింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నా. ప్రస్తుతం మాకు ైస్టెపెండ్ రూ.2,200 వస్తున్నది. అది చాలకున్నా కష్టపడి చదువును కొనసాగిస్తున్నా. సీఎం కేసీఆర్ ఒకేసారి రూ.8వేలు పెంచారు. నా కష్టాలు తీరినట్టే. సీఎంకు పాదాభివందనం.
దేవుడే ప్రత్యక్షమై వరమిచ్చినట్టుంది
ప్రస్తుతం వస్తున్న ైస్టెపెండ్ సరిపోక ఇంటి నుంచి డబ్బులను తెచ్చుకొనేవాళ్లం. అడక్కుండానే సీఎం కేసీఆర్ ైస్టెపెండ్ను మూడింతలు పెంచితే.. దేవుడే ప్రత్యక్షమై వరమిచ్చినట్టుగా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తాం.