హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో భారీ ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలోని టాటానగర్లో ఉన్న ఇస్తరాకుల కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా కంపెనీ మొత్తానికి విస్తరించడంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. దీనికితోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
అయితే కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు మంటలను గమనించి బయటకు పరుగులు తీయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పేపర్ ప్లేట్ల పరిశ్రమ ఇండ్ల మధ్య ఉండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.