సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మల్కాజిగిరిలోని వినాయక్నగర్లో అత్యధికంగా 5.20సెం.మీలు, అమీన్పూర్లోని కిస్టారెడ్డిపేటలో 2.38 సెం.మీలు, కీసరలో 2.15 , శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో 1.88, కొంగరకలాన్లో 1.65, సుల్తాన్పూర్, పటాన్చెరులో 1.60, ఆర్సీ పురంలో 1.58 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.9 డిగ్రీలు, కనిష్ఠం 23.0డిగ్రీలు, గాలిలో తేమ 96శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.