సిటీబ్యూరో, జనవరి 21 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ బ్లూక్రాస్ ఆధ్వర్యంలో దోమలగూడలోని చైతన్య విద్యాలయంలో ‘లవ్ మై ఇండీ డాగ్ షో’ రెండో ఎడిషన్ను ఆదివారం ఆ సంస్థ చైర్పర్సన్ అమల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీధి కుక్కలను పెంచుకుంటున్న అనేక మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బ్లూక్రా స్ పనిచేస్తున్నదని అమల అన్నారు. వీధి కుక్కలను గౌరవించడం బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘లవ్ మై ఇండీ డాగ్ షో’ అనేక జంతు ప్రేమికులను ఒక వేదికపైకి చేర్చుతున్నదన్నారు. కార్యక్రమంలో మార్స్పెట్కేర్ ఇండియా సేల్స్ డైరెక్టర్ నితిన్ జైన్, డాక్టర్ శుభం, డాక్టర్ లక్షి తదితరులు పాల్గొన్నారు.