సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): ‘ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చెప్పండి. రూ.7.50 లక్షలు గెలవండి’ అంటూ ఈ నెల 29న హైటెక్స్లో ఐస్క్రీమ్ ఫ్లేవర్ టేస్టింగ్ పోటీలు నిర్వహించబోతున్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హాజరు కానున్నారు. బుక్ మై షో, మీరా ఈవెంట్, పేటీఎం ఇన్సైడర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.