ఎర్రగడ్డ, మే 19 : ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పం దన లభించింది. సుల్తాన్నగర్, యూపీ గల్లీ ప్రాంతాల్లో స్థానిక మైనార్టీలు గోపీనాథ్కు స్వాగతం పలికి శాలువా లు, పూలమాలలతో సన్మానించారు. అంతర్గత రోడ్లు, సీవరేజీ, తాగునీటి సౌకర్యాలపై బస్తీలలో ఇప్పటికే మెరుగైన స్థితిలో ఉండటం వల్ల కేవలం చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. పాదయాత్రలో బల్దియా, జలమండలి, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొని స్థానికుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..
స్థానిక సమస్యలను వెనువెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్తే త్వరితగతిన పరిష్కరించటానికి వీలవుతుందని ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రాంతాలు, మతాలకు అతీతంగా అందరికీ ప్రభు త్వ సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రి కేసీఆర్ అందరివాడుగా పేరు తెచక్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 100 రోజులు పాదయాత్రను నిర్వహించి అన్ని డివిజన్ల ప్రజలను కలుసుకుని సమస్యలను పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం..
ఎర్రగడ్డ డివిజన్ సౌత్ శంకర్లాల్నగర్లో రూ.45 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అన్నిటికన్నా వెనుకబడ్డ ఎర్రగడ్డ డివిజన్పై ప్రత్యేక దృష్టిని సారించి ప్రతి బస్తీకి ఓ కమ్యూనిటీహాల్ ఉండే విధంగా చేశామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి. సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ నేతలు పల్లవియాదవ్, కల్యాణి, గౌస్ఖురేషీ, అజీమ్ పాల్గొన్నారు.