మాదాపూర్, మే 18: వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని మాదాపూర్లోని సాంస్కృతిక వనరుల శిక్షణ సంస్థ ప్రాంతీయ కార్యాలయం(సీసీఆర్టీ)లో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సమ్మర్ క్యాంపులను నిర్వహించనున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలను భవిషత్ తరాలకు అందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కోర్సుల్లో విద్యార్థులకు పర్ఫామింగ్, విజువల్, లిటరరీ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సీసీఆర్టీ స్పెషల్ ఆఫీసర్ తాడేపల్లి తెలిపారు. 5 నుంచి 7, 8 నుంచి 9వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి రెండు గ్రూపులుగా విభజించి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు. ఉచితంగానే కోర్సు సామగ్రి, భోజనం సమకూర్చనున్నామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు స్టాంప్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, బర్త్డే సర్టిఫికేట్తో పాటు కోర్సు ఫీజు (రూ.2000లు) చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు వెబ్సైట్ www.ccrtindia.gov.in సందర్శించడంతో పాటు 9063357895, 8886333799 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.
కోర్సు పేరు: నేర్పించే అంశాలు
పర్ఫామింగ్ ఆర్ట్స్: ఫోక్ డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం, మైమ్, కర్నాటిక్, హిందుస్థానీ సంగీతం
విజువల్ ఆర్ట్స్: చీరాల, నిర్మల్ పెయింటింగ్, కాన్ టెంపరరీ, క్రాఫ్ట్ డిజైనింగ్
లిటరరీ ఆర్ట్స్ : కవిత్వం, కథ, స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్ రైటింగ్