Mocha cyclone | సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతతో సతమతమైన నగరవాసులకు ఈ వాన ఉపశమనాన్ని కలిగించింది. రాజేంద్రనగర్లో 2 సెం.మీలు, శాస్త్రిపురంలో 1.0 సెం.మీలు, బహదూర్పురలోని కిషన్బాగ్లో 8 మి.మీలు, గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 7.5 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ వల్ల రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. గ్రేటర్కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.