వెంగళరావునగర్, జూన్ 22 : ఆడపిల్ల పుట్టిందని ఇంటి నుంచి గెంటేశారు.. మరో పాతిక లక్షలు పుట్టింటి నుంచి తేవాలంటూ చిత్రహింసలు పెట్టారు. భర్త, అత్తమామల వేదింపులు తీవ్రం కావడంతో చేసేది లేక పుట్టింటికి చేరింది. అక్కడ కొన్నాళ్లు ఉన్నా.. వారికి భారం కాలేక చివరికి అత్తింటికే వచ్చింది. కాని ఇంట్లోకి రానివ్వలేదు. ఇం టికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో చావైనా.. బతుకైనా ఇక్కడే అంటూ మూడ్రోజులుగా అత్తింటి ముందే బిడ్డను ఒళ్లో పెట్టుకుని ఆందోళనకు దిగింది.
ఘట్కేసర్కు చెందిన నర్సింహ, రమాదేవిల కుమార్తె ప్రగతికి గద్వాలకు చెందిన రామకృష్ణ, పద్మల కుమారుడు సురేశ్కుమార్తో 2017 ఆగస్టులో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెండ్లికి రూ.8లక్షల కట్నం, 26 తులాల బంగారు నగలు, వెండి ఆభరణాలు.. ఇతర లాంచనాలన్నీ ఇచ్చి ఘ నంగా వివాహం చేశారు. ముంబైలోని వి ప్రోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తు న్న సురేష్ కుమార్ తన భార్యను హైదరాబాద్లోని తన తల్లిదండ్రులు, సోదరులు ఉ న్న ఇంట్లోనే ఉంచాడు. కొంత కాలం పాటు వీరి కాపురం బాగానే సాగింది. పైండ్లెన రెం డు నెలలకు ప్రగతి గర్భం దాల్చింది. 2018 లో పాప పుట్టింది. అప్పటి నుంచి ప్రగతికి కష్టాలు ప్రారంభమయ్యాయి.
ఆడపిల్లను ఎందుకు కన్నావు..? ఆడపిల్ల ను కన్నందుకు మీ పుట్టింటి నుంచి మరో పాతిక లక్షలు, కారు తీసుకు రా.., లేదంటే.. విడాకులివ్వు. సురేష్కు మరో పెండ్లి చేస్తామంటూ అత్తింటివారు వేధించసాగారు. చివరకు బిడ్డతో సహా ఇంట్లోనుంచి గెంటివేయడంతో.. ప్రగతి పెట్టింటికి చేరింది. ఆడపిల్లను కన్నందుకు అదనపు కట్నం తెమ్మని వేధించిన అత్తింటివారిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భార్యభర్తల గొడవ కావడంతో వీరిని భరోసా సెంటర్కు పంపించారు. అత్తింటివారిని పిలిపిం చి.. పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు. చివరికి హైదరాబాద్ సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం కేసును బాధితురాలి పుట్టింటికి సమీపంలో ఉన్న సరూర్నగర్ మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో అత్త పద్మ, మామ రామకృష్ణ, మరిది కానిస్టేబుల్ రాజేశ్, మరో మరిది వినోద్లపై కేసు నమోదైంది.
ప్రగతి తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. దీంతో పుట్టింటి వారికి భారం కాలేక.. అత్తింటికే వెళ్లింది. కాని ప్రగతిని, ఆమె బిడ్డను ఇంట్లోకి రానివ్వకుండా భర్త సురేష్కుమార్, అత్తామామలు రామకృష్ణ, పద్మ, మరిది (కానిస్టేబుల్) రాజేశ్, మరో మరిది వినోద్ అడ్డుకున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సచ్చినా.. బతికినా భర్తతోనే ఉంటానంటూ.. ప్రగతి బిడ్డతోకలిసి మూడురోజులుగా అత్తింటి ముందే ఆందోళనకు దిగింది. స్థానికులు, మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచారు. స్థానికుల మద్దతుతో ఇంటి తాళం పగులగొట్టి.. ఇంట్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న భర్త, అత్తామామలు ఇంటికి చేరుకుని లోపలి బెడ్రూమ్లకు తాళాలు వేసుకున్నారు. ఆకలితో బిడ్డతో సహా హాల్లోనే ఉంటూ.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నది. బిడ్డను చూసైనా వారి మనస్సు కరగడం లేదు. తల్లి ఒడిలో ఉన్న పసిపాప ఆకలితో ఏడుస్తున్నా.. ఆ హృదయాలు చలించడం లేదు. ఇరుగుపొరుగువారే ఆ తల్లీబిడ్డల ఆకలిబాధ చూడలేక అన్నం పెట్టి ఆదుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే మరిది రాజేశ్ ప్రమేయంతోనే పోలీసులు ఈ కేసును పట్టించుకోకుండా నీరుగార్చుతున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు మరిది రాజేశ్ ప్రమేయంపై నగర పోలీస్ కమిషనర్కు సైతం ఫిర్యాదు చేశానని.. ఎవరూ తన గోడు పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.