మియాపూర్ /కేపీహెచ్బీ కాలనీ, మే 6 : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యం లో చర్యలు తీసుకుంటు న్నామని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత అన్నారు. గురువారం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో కరోనా నివారణకు హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీని డీసీ ప్రశాంతి, కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్గౌడ్తో కలిసి జడ్సీ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించి వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. జోన్ పరిధిలోని బస్తీ దవాఖానల సేవలను వినియోగించుకోవాలని, పలు దవాఖానల్లో కొవిడ్ పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ను చేపడుతున్నట్లు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, ఎస్ఈ లచ్చిరెడ్డి, ఏఈ ఉషారాణి, సూపర్వైజర్ నర్సింహ, పార్టీ యువనేత దొడ్ల రామకృష్ణాగౌడ్, గణేశ్, అంజిరెడ్డి, వెంకట్, సిద్ధయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని బాగ్మీర్, శాంతినగర్ కాలనీల్లో రసాయనాల పిచికారీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అల్లం మహేశ్, యాదయ్య, రవి, జగదీశ్గౌడ్, సంపత్, ముకుంద్, బాలకృష్ణ, చిన్న తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లి జోన్ కార్యాలయంలో డీఆర్ఎఫ్ వాహనాలతో చేపట్టిన క్రిమిసంహారక రసాయనాల పిచికారీని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఫీవర్ సర్వేను చేపట్టామని, జ్వరం, జలుబు ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. సమస్య తీవ్రంగా ఉంటేనే వైద్యశాలకు వెళ్లాలని కోరారు. రసాయనాల పిచికారీకి సర్కిల్కు ఒకటి చొప్పున ప్రత్యేక వాహనాలను కేటాయించామని అన్నారు. ఈ వాహనాలతో సమస్యాత్మక ప్రాంతాలలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, ప్రశాంతి, చీఫ్ ఎంటమాలజీ రాంబాబు, లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీలో….
కరోనా కట్టడికి ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని…మాస్కులు ధరించి బాధ్యతగా వ్యవహరించాలని కేపీహెచ్బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని సర్ధార్పటేల్ నగర్లో ఇంటింటికీ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.