హైదరాబాద్ : మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. 17 న నిర్వహించే సికింద్రాబాద్ బోనాలకు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. బోనాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.